News September 12, 2025

‘సిరిసిల్లలో రేపు లోకాదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

సిరిసిల్లలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్‌పర్సన్, న్యాయమూర్తి పి.నీరజ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఉ.10.30 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు వారి సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

Similar News

News September 13, 2025

JNTU: బీటెక్ 1st ఇయర్ 2nd సెమిస్టర్ ఫలితాలు

image

జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ 1st ఇయర్ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డైరెక్టర్ విడుదల చేశారు. పరీక్షకు 16,521 మంది నమోదు చేసుకోగా 15,762 మంది హాజరయ్యారు. పరీక్షలు అన్ని సబ్జెక్టులలో 6,680 పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించగా 42.38% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

News September 13, 2025

భవనం గుండా ఫ్లైఓవర్.. ఎక్కడంటే?

image

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంటాఖానా అశోక్ చౌక్‌ వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ చర్చనీయాంశమవుతోంది. ఫ్లైఓవర్‌ను ఏకంగా నివాస భవనం గుండా తీసుకెళ్లడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. జవాబుదారీతనం లేకపోవడంతోనే ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలోనూ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన విషయం తెలిసిందే.

News September 13, 2025

HYD: ‘ఆర్టీసీలోనూ యూనియన్లను పునరుద్ధరించాలి’

image

తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన 9 సంఘాలను సీఎం పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని 2021 PRC ప్రకటించాలని సీఎంకి విజ్ఞప్తి చేస్తూ సీఎంవోలో వినతి పత్రం ఇచ్చారు.