News April 4, 2025

సిరిసిల్లా: ‘సన్నబియ్యం రవాణా పంపిణీ వేగవంతం చేయాలి’

image

రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా, పంపిణీ వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సన్న బియ్యం సరఫరాపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు.

Similar News

News April 16, 2025

చాహల్‌కు POTM.. ఆర్జే మహ్వాష్ పోస్ట్ వైరల్

image

కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. ఈ క్రమంలో చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా వైరల్‌గా మారింది. ‘వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడు అనేందుకు ఇదే కారణం. అసామాన్యుడు’ అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్లు పెడుతున్నారు.

News April 16, 2025

NZB: శని పుత్రుడు పోచారం: జీవన్ రెడ్డి

image

బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆరోపించారు. బాన్సువాడలో మంగళవారం జరిగిన BRS రజతోత్సవ సభ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాసరెడ్డిని CM కేసీఆర్ లక్ష్మీ పుత్రుడు అని ప్రేమగా పిలిచేవారన్నారు. అయితే ఆయన లక్ష్మీ పుత్రుడు కాదని, శని పుత్రుడు అని ఎద్దేవా చేశారు.

News April 16, 2025

రాష్ట్రంలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు.

error: Content is protected !!