News February 22, 2025

సిరిసిల్ల: అధికారులకు ధన్యవాదాలు

image

సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన భూకబ్జాపై అధికారులు స్పందించి స్వాధీనం చేసుకున్నందుకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామ సమీపంలో గల మైసమ్మ చెరువులో 199 సర్వే నంబర్‌లో 8 ఎకరాల భూమిని ఆగయ్య కొనుగోలు చేసి అదనంగా ఎకరం భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు.

Similar News

News February 20, 2026

రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగొద్దు: ప్రియాంక

image

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్‌, ఆయన భార్య ఎలిజబెత్‌కు పాక్ ఏజెంట్‌తో <<19086206>>సంబంధాలున్నాయంటూ<<>> అస్సాం సీఎం హిమంత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక ఫైరయ్యారు. రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగడం దుర్మార్గమన్నారు. ఎవరూ ఇలా చేయకూడదని స్పష్టం చేశారు. గౌరవ్ సానుకూల, ప్రేమపూర్వక రాజకీయాలు చేస్తారని పేర్కొన్నారు. CM అనవసర విమర్శలు వదిలేసి ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని హితవు పలికారు.

News February 20, 2026

భద్రాద్రి: ప్రభుత్వ ఐటీఐలో షార్ట్ టర్మ్ శిక్షణ

image

ప్రభుత్వ ఐటీఐలో షార్ట్ టర్మ్‌లో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వ శిక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని కొత్తగూడెం ప్రిన్సిపల్ రమేశ్ తెలిపారు. పీఎంకేవీవై ద్వారా సీఎన్సీ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, 3D ప్రింటర్ కోర్సులకు కొత్తగూడెంలో, సీఎన్సీ ప్రోగ్రామర్, ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులకు కృష్ణ సాగర్, మణుగూరు ఐటీఐలో శిక్షణ ఉంటుందని చెప్పారు. సమీప ఐటీఐని సంప్రదించాలన్నారు.

News February 20, 2026

నానబెట్టిన మెంతులు మంచివేనా?

image

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.