News December 7, 2025
సిరిసిల్ల: ఆల్ట్రా మారథాన్ రన్ లో పాల్గొన్న జిల్లా కానిస్టేబుల్

రాజస్థాన్లో నిర్వహించిన 100 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల ఆల్ట్రా మారథాన్ రన్ లో జిల్లాకు చెందిన ఆర్ముడు రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ యాదవ్ పాల్గొన్నారని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. 100 కిలోమీటర్లు సాగిన ఈ రన్ లో అపారమైన ధైర్య సాహసాలు, శారీరక, మానసిక దృఢత్వాన్ని కానిస్టేబుల్ అనిల్ యాదవ్ ప్రదర్శించాడన్నారు. ఇటువంటి ఈవెంట్లో పాల్గొనడం ద్వారా యువ సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
Similar News
News March 6, 2026
HNK: యాక్సిడెంట్లో మరణించిన విద్యార్థులు వీరే

హసన్పర్తి వద్ద జరిగిన <<19313318>>రోడ్డు ప్రమాదం<<>>లో ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న వరంగల్ ఎల్లమ్మ బజార్కు చెందిన ఆకుతోట సుప్రతిక, మంగపేటలోని రాజుపేటకు చెందిన జునైద్ అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు మార్చురీకి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. అక్కడున్నవారు సైతం కంటతడి పెట్టారు.
News March 6, 2026
రామగుండం: నాలుగేళ్ల చిన్నారిపై కుక్కల దాడి

రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ కార్పొరేటర్ తిప్పారపు మానస కుమారుడు నాలుగేళ్ల చార్విక్ శుక్రవారం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో తల, శరీర భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, వీటిని నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News March 6, 2026
నిజామాబాద్: ఏసీ గదులు వదిలి గ్రామాల బాట పట్టండి: మంత్రి సీతక్క

నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రి సీతక్క అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అధికారులు ఏసీ గదులు వదిలి గ్రామాల బాట పట్టి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అభివృద్ధిలో నిజామాబాద్ జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు.


