News January 7, 2026
సిరిసిల్ల: ఇస్రో శాస్త్రవేత్తగా గంభీరావుపేట వాసి.. కేటీఆర్ అభినందనలు

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన సాయి చరణ్ ఇస్రో పరిధిలోని ఎన్ఆర్ఎస్సీలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సాయి చరణ్ స్నేహితుడు ‘ఎక్స్’ వేదికగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి సాయి చరణ్కు శుభాకంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు ఎంపికైన సాయి చరణ్, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News January 31, 2026
శని త్రయోదశి నాడు పఠించాల్సిన శ్లోకం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్|
ఛాయా మార్తాండ సంభూతుడు తం నమామి శనైశ్చరమ్||
నేడు ఈ శ్లోకాన్ని కనీసం 11 సార్లు పఠించడం వల్ల శని గ్రహ పీడలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ‘‘ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలంటున్నారు. ‘‘ఓం నమః శివాయ’’ పంచాక్షరీ మంత్రాన్ని జపించినా విశేష ఫలితాలుంటాయని, వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని సూచిస్తున్నారు.
News January 31, 2026
యాంగ్జైటీని తగ్గించే ముద్ర

ఒత్తిడి వల్ల ప్రస్తుతకాలంలో చాలామంది యాంగ్జైటీకి గురవుతున్నారు. దీనికి వజ్ర పద్మ ముద్ర పరిష్కారం చూపుతుంది. రెండు చేతుల వేళ్లనూ ఒకదానితో ఒకటి కలిపి బొటనవేలును కూడా దగ్గరగా పెట్టుకోవాలి. ఛాతీభాగానికి అంటించకుండా కొద్ది దూరానుంచాలి. కళ్లు మూసుకుని మెల్లగా శ్వాసపై ధ్యాస పెట్టాలి. యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నవాళ్లు రోజుకు 5నిమిషాల చొప్పున మూడుపూటలా చేయండి. దీన్ని తినగానే మాత్రం చేయకూడదు.
News January 31, 2026
అమ్మోరు/మశూచి వ్యాధిని కోళ్లలో ఇలా గుర్తించండి

మశూచి వ్యాధి సోకిన కోళ్ల ముక్కు, ముఖం, కంటి రెప్పలు, దవడల పైన బొబ్బలు వచ్చి ముక్కు నుంచి, కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇది తక్కువ వ్యవధిలో ఇతర కోళ్లకు వ్యాపిస్తుంది. దీని వల్ల కోళ్ల మరణాలు తక్కువే ఉన్నప్పటికీ.. సరిగా మేత, నీరు తీసుకోలేవు. గుడ్లు పెట్టడం ఆగిపోతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. చర్మంపై కురుపుల్లో ఇతర సూక్ష్మక్రిములు చేరకుండా ఉండేందుకు పసుపు, వేపనూనె మిశ్రమాన్ని పూతగా పూయాలి.


