News April 12, 2025
సిరిసిల్ల: ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

ఈనెల 21 లోపు ముంపు గ్రామాల ప్రజలు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఈనెల 11 నుంచి 21 వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News April 14, 2026
వికారాబాద్: రూ.500కే 50 కిలోల బస్తా..!

ఉల్లి రైతులకు జిల్లాలో కన్నీళ్లే మిగులుతున్నాయి. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేదేంలేక VKB పట్టణంలోని ప్రధాన రోడ్లపైకి ట్రాక్టర్లతో ఉల్లిని తెచ్చి విక్రయిస్తున్నారు. 50కిలోల బస్తాను రూ.500కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు.
News April 14, 2026
PSL.. ముజరబానీపై రెండేళ్లపాటు నిషేధం

ZIM బౌలర్ ముజరబానీపై PSL రెండేళ్లపాటు నిషేధం విధించింది. PSLలో ఆడాల్సిన ఆయన, ఆ ఒప్పందాన్ని కాదని IPLలో ఆడేందుకు KKR జట్టులో చేరారు. ఇలా చేయడం ప్రొఫెషనలిజం కాదని, అందుకే వచ్చే 2 సీజన్లలో ఆడకుండా బ్యాన్ చేస్తున్నట్లు PSL ప్రకటించింది. MI ప్లేయర్ బాష్నూ గత సీజన్లో ఏడాదిపాటు నిషేధించింది. కాగా IPL కోసం PSL నుంచి తప్పుకున్న వారిలో శనక, స్పెన్సర్ జాన్సన్ కూడా ఉన్నారు. వారినీ బ్యాన్ చేసే ఛాన్సుంది.
News April 14, 2026
పెద్దపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన డా. బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనే తమ లక్ష్యమని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు విజయరమణారావు, నాయకులు పాల్గొన్నారు.


