News May 21, 2024

సిరిసిల్ల: ‘ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోండి’

image

26 జనవరి 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే జాతీయ స్థాయి పద్మ అవార్డుల కోసం నైపుణ్యం కలిగిన చేనేత అనుబంధ కార్మికుల నుంచి దరఖాస్తులు కోరుతూ చేనేత, జౌళి శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. చేనేత కార్మికులు వారి వివరాలను http//padmaawards.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తులను మాత్రమే ధృవీకరిస్తారని, మే 25లోగా జౌళి శాఖలో దరఖాస్తులు సమర్పించాలని అన్నారు.

Similar News

News September 13, 2025

KNR: ‘ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం విషయాలపై అవగాహన వస్తోంది’

image

రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ భవనంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. శుక్రవారం సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాలపై అవగాహన వస్తోందన్నారు. మహిళ తనతోపాటు తన పిల్లల పోషణ ఎలా ఉందో తెలుసుకోగలుగుతోందని సూచించారు.

News September 13, 2025

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు: కరీంనగర్ కలెక్టర్

image

జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు.

News September 12, 2025

కరీంనగర్‌లో ఈనెల 17న జాబ్ మేళా

image

నిరుద్యోగులకు కరీంనగర్ కళ్యాణి జ్యువెలర్స్‌లో జాబ్స్ కోసం ఈనెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయసు 19 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. వేతనం రూ.20,000 అని, ఆసక్తి గల వారు ఈనెల 17న KNR ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని, వివరాలకు 9052259333, 9944922677, 7207659969, 9908230384 నంబర్లను సంప్రదించాలని కోరారు.