News March 13, 2025

సిరిసిల్ల: ఉపాధ్యక్షురాలుగా లావణ్య లింగారెడ్డి

image

సిరిసిల్ల జిల్లా బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా తంగళ్ళపల్లికి చెందిన ఆసాని లావణ్య లింగారెడ్డిని నియమించినట్టు జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో లావణ్య లింగారెడ్డికి ఆమె గురువారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలువురు లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News October 27, 2025

గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పిల్లర్‌కు దీప్తి పెయింటింగ్

image

జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవంజి దీప్తి పెయింటింగ్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పిల్లర్‌కు వేశారు. పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించడమే కాకుండా ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును సైతం దీప్తి సొంతం చేసుకుంది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2025లో భాగంగా రెండు స్వర్ణాలను సాధించింది. దీంతో ప్రభుత్వం ఆమె పెయింటింగ్‌ను పిల్లర్‌పై వేయించింది.

News October 27, 2025

డీసీసీ పీఠం పర్వతగిరికి దక్కేనా..?

image

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం పర్వతగిరికి దక్కుతుందా? అని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం ప్రారంభించిన నేపథ్యంలో పర్వతగిరి మండలం నుంచి ఇరువురు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏనుగల్లు గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు ఉన్నారు.

News October 27, 2025

జూబ్లీహిల్స్‌లో అభ్యర్థులకు రకరకాల గుర్తులు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు ఉండగా వారికి ఎన్నికల అధికారులు వివిధ గుర్తులను కేటాయించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో యాపిల్, ద్రాక్ష, గాలి కొట్టే పంపు, బెలూన్, బేబీ వాకర్, కూలర్, టీవీ రిమోట్, బెల్ట్ తదితర గుర్తులను కేటాయించారు. అయితే ఈ గుర్తులను అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.