News April 9, 2024
సిరిసిల్ల: ఎంట్రెన్స్ రాయకున్నా పాలిటెక్నిక్లో ఉచిత సీటు

దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ HYDలో ప్రవేశానికై తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాయకున్నా కేవలం 10వ తరగతి చదివిన అర్హులన్నారు. ఆసక్తి గలవారు మే15లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. దరఖాస్తు ఫారాల కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Similar News
News September 10, 2025
KNR: RTC పంచారామాలు టూర్ ప్యాకేజీ వివరాలు

KNR- 2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో పంచారామాలు అనగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోట దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ఈనెల 12న రా.10 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఈనెల 15న బస్సు KNR చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.3,300/-, పిల్లలకు రూ.2,500/- టికెట్ నిర్ణయించామన్నారు. వివరాలకు CALL 9398658062.
News September 10, 2025
KNR: ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ: కలెక్టర్

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు.
News September 9, 2025
KNR: SRR విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీగెట్) పరీక్ష ఫలితాల్లో SRR ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కామర్స్ విభాగంలో అక్కెం తిరుమలకు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు, జంగం నందిని 3వ ర్యాంకు సాధించారు. బాటనీ విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు పుట్టి అఖిల సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.