News February 26, 2025
సిరిసిల్ల: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరపాలి : ఎస్పీ

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS యాక్ట్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
గద్వాల: ‘ఇంటర్ పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకండి’

ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి ధైర్యంగా పరీక్షలు ఎదుర్కోవాలని గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.సంధ్య కిరణ్మయి మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. పరీక్షా కేంద్రాలకు కనీసం 30-45 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించిన ఆమె, చివరి నిమిషం హడావుడి వల్ల ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు.
News February 24, 2026
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జపాన్ టూరిస్టుల సందడి

జపాన్ నుంచి నగరానికి వచ్చిన పర్యాటకులు South India Shopping Mallలో సందడి చేశారు. భారతీయ సంప్రదాయం, ఆధునిక డిజైన్లు, విస్తృత కలెక్షన్లు ఒకేచోట లభించడం వారిని ఆకట్టుకున్నట్లు తెలిపారు. దక్షిణ భారత సంప్రదాయ వస్త్రాల నాణ్యత, సరసమైన ధరలు, ఆతిథ్య సేవలు ప్రత్యేకంగా నచ్చాయన్నారు. ‘ఇది జీవితంలో బెస్ట్ షాపింగ్ అనుభవం’ అని వారు పేర్కొన్నారు. విదేశీయులను తమ మాల్ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.
News February 24, 2026
భద్రాద్రి జిల్లాలో 2 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం!

మహిళా సంఘాల్లోని సభ్యుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 2 సోలార్ పవర్ ప్లాంట్లను మంజూరు చేసింది. భద్రాద్రి జిల్లాలోని సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం, మణుగూరు మండలంలోని ఉడతనేని గుంపు గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎంపిక చేసింది. ఒక్కో పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించనుంది


