News March 13, 2025
సిరిసిల్ల :ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి గీతేను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటా ఆగయ్య నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చక్రపాణి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు లక్ష్మీనారాయణ, మురళి, శ్రీనివాస్, సర్దార్ ఉన్నారు.
Similar News
News April 8, 2026
ట్రంప్.. యుద్ధం వల్ల ఏం సాధించావ్?

ఇరాన్తో యుద్ధం ద్వారా ట్రంప్ ఏం సాధించారన్న ప్రశ్న తలెత్తుతోంది. యుద్ధం ముందు వరకు హార్ముజ్ నుంచి నౌకల రవాణా సాఫీగా సాగేది. ప్రపంచంలో ఎలాంటి ఆయిల్, గ్యాస్, ఎనర్జీ కొరత ఉండేది కాదు. FEB 28న వార్ స్టార్ట్ చేయగానే ఇరాన్ హార్ముజ్ను బంద్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం మొదలైంది. ఇప్పుడు తమ ఆర్మీ పర్యవేక్షణలోనే హార్ముజ్ ద్వారా రాకపోకలు సాగుతాయని ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందంలో షరతు పెట్టింది.
News April 8, 2026
NLG: ప్రయాణికులకు తప్పని తోపులాట

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 7 డిపోల పరిధిలో నిత్యం 2,82,150 మంది ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరిగినా దానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులకు తోపులాట తప్పడం లేదు. మూడు నెలలుగా ‘డయల్ యువర్ ఆర్ఎం’ కార్యక్రమం నిర్వహించకపోవడంతో సమస్యలు చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయిందని అంటున్నారు.
News April 8, 2026
వేసవిలో జాగ్రత్త: పిల్లలను ఈతకు పంపొద్దు

వేసవి తీవ్రత దృష్ట్యా చెరువులు, బావుల్లో <<19595547>>ఈతకు<<>> వెళ్తున్న విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. లోతు అంచనా వేయలేక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జిల్లాలో విషాదం నింపుతున్నాయి. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతకమైన చోట్ల ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇటువంటి విషాదాల నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు.


