News March 13, 2025
సిరిసిల్ల :ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి గీతేను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటా ఆగయ్య నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చక్రపాణి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు లక్ష్మీనారాయణ, మురళి, శ్రీనివాస్, సర్దార్ ఉన్నారు.
Similar News
News February 2, 2026
జకోవిచ్.. ఆ టైటిల్ ఎప్పుడు నెగ్గుతాడో?

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమితో జకోవిచ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన 10సార్లూ జకోవిచ్ విజయం సాధించారు. నిన్న జరిగిన ఫైనల్లోనూ గెలిచి, 25వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలన్న జకోవిచ్ ఆశలపై అల్కరాజ్ నీళ్లు చల్లారు. 2023 యూఎస్ ఓపెన్ తర్వాత ఈ సెర్బియా వీరుడు ఒక్క సింగిల్ గ్రాండ్ స్లామ్ టైటిల్నూ గెలవలేదు.
News February 2, 2026
హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు

కేంద్ర బడ్జెట్లో రైల్వేకు రూ.2.77 లక్షల కోట్లు కేటాయించడంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే, ప్రయాణికుల భద్రత కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఏడు హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 2, 2026
MHBD: పుర పోరు.. ‘బుజ్జగింపులు ‘ షురూ..!

మహబూబాబాద్ జిల్లాలో నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. దీంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు రాయబేరాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉండటంతో MHBD, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం లాంటి మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నుంచి ఆశావహులు తలనొప్పిగా మారింది.


