News February 26, 2025
సిరిసిల్ల: ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 22,397 మంది పట్టభద్రులు, 950 మంది ఉపాధ్యాయులు ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రతి పట్టభద్రుడు, ఉపాధ్యాయుడు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News February 26, 2025
నందమూరి మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ ఝలక్?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా నుంచి ప్రశాంత్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్తో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందించేందుకు ప్రశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం.
News February 26, 2025
శివరాత్రి.. మీరేం చేస్తున్నారు?

మహాశివరాత్రి రోజు భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తూ భగవంతుడి సేవలో తరిస్తారు. కొందరు శైవ క్షేత్రాలలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం, శివ కథాపారాయణలు, శివ నామస్మరణ చేయడం, పాటలు వినడం, భక్తి సినిమాలు చూడటం వంటివి చేస్తుంటారు. మరి జాగరణ సమయంలో మీరేం చేస్తారు? కామెంట్ చేయండి.
News February 26, 2025
CT: వ్యక్తిగత స్కోరులో జద్రాన్ రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అదిరిపోయే ఇన్నింగ్స్తో దుమ్ములేపారు. 146 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశారు. దీంతో CTలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్గా జద్రాన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ ఈ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్పై ఉండేది. డకెట్ తర్వాత నాథన్ ఆస్టిల్ (145*), ఆండీ ఫ్లవర్ (145), గంగూలీ (141) ఉన్నారు.