News July 9, 2025

సిరిసిల్ల: కస్తుర్భా విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

image

బోయినపల్లిలోని కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈరోజు పరిశీలించారు. పదో తరగతి గదిని సందర్శించి, విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కిచెన్, స్టోర్ రూమ్, మధ్యాహ్న భోజనం తయారీ తీరును పరిశీలించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News July 10, 2025

మరో 6 దేశాలకు టారిఫ్స్ ప్రకటించిన ట్రంప్

image

అధిక సుంకాల విధింపు గడువును US అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పటికల్లా ఒప్పందాలు చేసుకోకపోతే అమెరికాకు ఎగుమతులపై పెంచిన టారిఫ్స్ కట్టాలి. రెండ్రోజుల క్రితం 14 దేశాలకు ఈ టారిఫ్స్ వివరాలతో లేఖలు పంపారు. ఇప్పుడు మరో ఆరు దేశాలకు ట్రంప్ కొత్త టారిఫ్స్‌ ప్రకటించారు. ఇరాన్-30%, అల్జీరియా-30%, లిబియా-30%. ఫిలిప్పీన్స్-25%, బ్రూనై-25%, మోల్డోవా-25% చెల్లించాలని తెలిపారు.

News July 10, 2025

రాజధాని రైతులు కోరినట్లే ప్లాట్లు: నారాయణ

image

AP: పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపుపై మంత్రి చర్చించారు. ప్లాట్ల కేటాయింపుపై రైతులు కూడా తమ అభిప్రాయాలను మంత్రి నారాయణకు తెలియజేశారు. రైతులు కోరినట్లే ప్లాట్ల కేటాయింపు ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

News July 10, 2025

నేడు భద్రాద్రి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన

image

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30కు కొత్తగూడెం క్లబ్లో AITUC జిల్లా కార్యదర్శి, సీపీఎం నాయకుడు వీరన్న తెలంగాణ జాగృతిలో చేరే కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు పాల్వంచలో మహిళా నాయకురాలు సింధు తపస్వి నివాస సందర్శన, అనంతరం పాల్వంచ పెద్దమ్మ తల్లి దర్శనం ఉంటుంది. 3 గంటలకు తల్లిని కోల్పోయిన జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావును పరామర్శిస్తారు.