News March 7, 2025

సిరిసిల్ల: కార్యదర్శులకు మెమోలు జారీ

image

సిరిసిల్ల జిల్లాలో సమయపాలన పాటించని కార్యదర్శులకు మెమోలు జారి చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ పంచాయతీ అధికారి శేషాద్రి తెలిపారు. వెల్జిపూర్, పొత్తూరు, ఓబులాపూర్, వల్లంపట్ల, కిష్టారావుపల్లి, తెలుగువారిపల్లి, పెద్ద లింగాపూర్, వెంకటరావుపల్లి, గంభీరావుపేట(M)లోని నర్మల, లక్ష్మీపూర్, ముస్తఫా నగర్, తంగళ్లపల్లి(M) నర్సింహులపల్లి, బద్దెనపల్లి, అంకిరెడ్డిపల్లి, బాలమల్లుపల్లి కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు.

Similar News

News September 17, 2025

WGL: పసుపు క్వింటా రూ.10,555

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,530 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.,4500 ధర పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,300 ధర వచ్చింది. మరో వైపు దీపిక మిర్చి క్వింటా రూ.14 వేలు, పసుపు రూ.10,555 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News September 17, 2025

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మోడల్స్ ప్రదర్శన

image

విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు జరిగే 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) యొక్క సూక్ష్మ నమూనాలను APCRDA ప్రదర్శించనుంది. ప్రజలు భవిష్యత్తులో నిర్మించబోయే ఈ కాంప్లెక్స్‌ను ప్రత్యక్షంగా చూసి అనుభూతి పొందేందుకు వీలుగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది.

News September 17, 2025

అమరావతి మినియేచర్ మోడల్స్ సందర్శించే అవకాశం

image

రాజధానిలో నిర్మించే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) సూక్ష్మ నమూనాలను(మినియేచర్ మోడల్స్) ప్రజల సందర్శనార్ధం ప్రదర్శించనున్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో వీటిని ప్రదర్శిస్తామని CRDA కమిషనర్ కార్యాలయం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు, HOD టవర్స్ మినియేచర్ మోడల్స్ ఈ కార్యక్రమంలో ప్రజలు సందర్శించవచ్చని CRDA పేర్కొంది.