News December 22, 2025
సిరిసిల్ల: కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 260 జీపీలు, 2,268 వార్డుల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. నిధుల సమస్యతో ప్రమాణ స్వీకార ఖర్చు విషయంలో కార్యదర్శులు తర్జనభర్జన పడుతున్నారు.
Similar News
News December 23, 2025
బాపట్లలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం నిర్వహించిన PGRSలో కలెక్టర్ పర్యాటక ప్రాంతాల సంరక్షణ, స్వచ్ఛత, మాస్టర్ ప్రణాళిక తయారీపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సూర్యలంక అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలవ్వగా, బీచ్ల వద్ద ప్రతి సోమవారం పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
News December 23, 2025
నరమాంస తోడేలు.. తల్లి ఒడిలోని బాలుడిని ఎత్తుకెళ్లి..

UPలో నరమాంస తోడేళ్లు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా బహ్రైచ్(D) రసూల్పూర్ దారెహ్తాలో దారుణం జరిగింది. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు పడుతుండగా మూడేళ్ల చిన్నారి అన్షుని తోడేలు నోట కరుచుకుని పారిపోయింది. తల్లి దాని వెంట పడినప్పటికీ తెల్లవారుజామున కావడంతో ఆచూకీ దొరకలేదు. కొంతదూరంలో అన్షు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఆ జిల్లాలో తోడేళ్ల దాడిలో 12 మంది చనిపోగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.
News December 23, 2025
GNT: డీజీపీ కమెండేషన్ డిస్క్లకు ఎంపికైన పోలీస్ అధికారులు

ఏపీ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన పోలీస్ అధికారులకు 2025 సంవత్సరానికి గాను డీజీపీ కమెండేషన్ డిస్క్లను ప్రకటించారు. ఈ అవార్డులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ విభాగాల్లో అందజేస్తారు. సిల్వర్ డిస్క్ విభాగంలో ASP(అడ్మిన్) జి. వెంకట రమణ మూర్తి, తాడికొండ సీఐ కె. వాసు, చేబ్రోలు పోలీస్ ఏఎస్సై–(2260) యు. శ్రీనివాసరావు ఎంపికయ్యారు. అటు బ్రాంజ్ మెడల్ విభాగంలో మరో 20 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు.


