News March 23, 2026

‘సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు.. అంతా ఫేక్’

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టుకు ఈరోజు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై న్యాయమూర్తులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. BD, డాగ్ స్క్వాడ్‌తో గాలించగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది ఫేక్ మెయిల్‌గా తేలింది. కోర్టు చీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (CAO) ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News April 14, 2026

కామారెడ్డిలో కూరగాయల ధరలు ఇలా!

image

కామారెడ్డి మార్కెట్లో కూరగాయల ధరలు మంగళవారం సాధారణంగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో కేజీ టమాటా రూ.20, బీరకాయ రూ.60, క్యాబేజీ రూ.50, కాకరకాయ రూ.60, ఆలుగడ్డ రూ.30, ఉల్లిపాయ రూ.20గా విక్రయిస్తున్నారు. అలాగే పాలకూర రూ.50, వంకాయ రూ.50, క్యారెట్ రూ.50, చిక్కుడు రూ.50, కాలీఫ్లవర్ రూ.50, క్యాప్సికమ్ రూ.50 ధరలకు లభిస్తున్నాయి. ధరలు స్థిరంగా ఉండటంతో వినియోగదారులు కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు.

News April 14, 2026

బాపట్ల: ఫై‌ఓవరపై దొరికిన వ్యక్తి మృతి..ఆచూకీ తెలిస్తే తెలపండి

image

బాపట్లలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గుంటూరు రహదారి ఫ్లైఓవర్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలితం లేక మరణించాడని, మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2026

గొప్ప ఆర్థికవేత్త అంబేడ్కర్!

image

భారత రాజ్యాంగ నిర్మాతగా అందరికీ తెలిసిన Dr.BR అంబేడ్కర్ గొప్ప ఆర్థికవేత్త కూడా. 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ కోసం ఆయన రాసిన ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ’ పుస్తకం IND, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి దోహదపడింది. దేశంలో RBI ఏర్పాటుకూ సహకరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక దోపిడీ, భారతీయులను ఆర్థిక బానిసలుగా మార్చిన తీరును తన పరిశోధనలతో ప్రపంచానికి చాటారు. ఇవాళ ఆ మహనీయుడి జయంతి.