News February 16, 2026

సిరిసిల్ల: కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఆర్డీవో

image

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్‌లతో ఆర్డీవో వెంకటేశ్వర్లు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. కాసేపట్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు, బీజేపీకి చెందిన 5 గురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ సమావేశానికి హాజరు కాలేదు.

Similar News

News April 5, 2026

అనంత జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

సీఎం చంద్రబాబు ఈనెల 6న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. ఉదయం 11:10 గంటలకు యాడికి(M) వేములపాడుకు చేరుకుంటారు. 11:30 నుంచి ఒంటి గంట వరకు ‘ప్రజావేదిక’లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:40-02:30 మధ్య పెండేకల్లు రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. 2:40-4:10 వరకు వేములపాడులో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. 4:20 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

News April 5, 2026

ఒకే కథ.. 3 ప్రాజెక్టులు!

image

‘కుమారస్వామి’ కథతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా తెరకెక్కించాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ కథాంశంతోనే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయన కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. కాగా ‘కుమారస్వామి’పై తానూ ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్లు కిశోర్ తిరుమల కూడా గతంలో వెల్లడించారు. మరి వీటిలో ఏది ముందుగా థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

News April 5, 2026

హాజరుకాని వారికి నోటీసులు: ZP ఛైర్మన్

image

చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జడ్పీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరవడంతో నోటీసులు పంపించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలన్నారు. మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.