News February 17, 2025
సిరిసిల్ల: గంజాయితో పట్టుపడ్డ వ్యక్తి అరెస్టు

రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగిలో గంజాయితో పట్టుబడిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్టు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గంగాధర మండలానికి చెందిన పొత్తూరి రాకేశ్ అనే వ్యక్తి రుద్రంగిలో గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఎన్డిపీఏస్ చట్టం ప్రకారం గంజాయి కలిగి ఉండటం, రవాణా చేయటం, తాగటం, అమ్మటం నేరమని తెలిపారు. ఎవరైనా, ఎక్కడైనా గంజాయి కలిగి ఉన్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News November 14, 2025
విశాఖ: 400 MOUలు.. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులు

విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులతో 400 ఎంఓయూలు జరిగాయి. వీటి ద్వారా 13,32,445 ఉద్యోగాలు రానున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది. ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐఅండ్ఐ, పరిశ్రమలు-వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
News November 14, 2025
GWL: రేపు జిల్లాకు రానున్న కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, రేపు (శనివారం) గద్వాల నుంచి ప్రారంభం కానున్న సీపీఐ రాష్ట్ర బస్సు జాత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని సీపీఐ గద్వాల జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బస్సు జాత ప్రారంభానికి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
News November 14, 2025
WATER SCARCITY.. ఆరుతడి పంటలే వేయాలి: కృష్ణాడెల్టా CE

AP: 2026 మే వరకు సాగు, తాగు అవసరాలకు 228 TMCల నీరు అవసరమని కృష్ణాడెల్టా CE రాంబాబు తెలిపారు. ‘శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి వినియోగించినది పోగా AP వాటా ఇంకా 118 TMCలే ఉంది. పులిచింతలలోని 40 TMCలను కలిపితే మొత్తం 158TMCలు అందుబాటులో ఉంది. ప్రస్తుత అవసరాలను దీనితోనే తీర్చాలి’ అని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు రబీ పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించారు.


