News March 23, 2025
సిరిసిల్ల: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
Similar News
News February 24, 2026
ఐఐసీటీలో 16 పోస్టులకు ఇంటర్వ్యూ

<
News February 24, 2026
ENGvsPAK.. నేడు పాక్ ఓడితే సెమీస్ ఆశలు గల్లంతు?

T20WC సూపర్-8లో భాగంగా ఇవాళ గ్రూప్-2లోని ఇంగ్లండ్-పాకిస్థాన్ తలపడనున్నాయి. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే శ్రీలంకపై ఘన విజయం సాధించి జోరు మీదున్న ఇంగ్లండ్ నేడు కూడా గెలిస్తే సెమీస్కు చేరువవుతుంది. కివీస్తో మ్యాచ్ రద్దవడంతో ఇవాళ మ్యాచ్ పాకిస్థాన్కు కీలకం. ఓడితే సెమీస్ ఆశలు సంక్లిష్టమవుతాయి. న్యూజిలాండ్, శ్రీలంక జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది.
News February 24, 2026
SKLM: ఫిబ్రవరి 25న జాబ్ మేళా..రూ.16-26 వేలతో ఉద్యోగాలు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం వద్ద జాబ్ మేళా జరుగనుందని డీఆర్డీఏ పథకం సంచాలకులు కిరణ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సంస్థలైన డీ-మార్ట్, ఫ్యూషన్ ఫైనాన్స్ల్లో అసోసియేట్ క్యాషియర్, పర్చేజ్, రిలేషన్షిప్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. 19-35ఏళ్లు ఉండాలన్నారు. రూ.16-26 వేలు జీతం ఇవ్వనున్నారు.


