News December 29, 2025
సిరిసిల్ల: ‘గెలిచినా.. ఓడినా లెక్క చెప్పాల్సిందే’

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు గెలిచినా, ఓడినా 45 రోజుల్లో ఎంపీడీవోలకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాగా, చాలామంది అభ్యర్థులు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గడువు దాటితే అభ్యర్థులపై వేటు పడే అవకాశం లేకపోలేదు.
Similar News
News December 31, 2025
HEADLINES

* వైభవంగా వైకుంఠ ఏకాదశి.. కిటకిటలాడిన వెంకన్న ఆలయాలు
* తిరుమల శ్రీవారిని దర్శించుకున్న CM రేవంత్ సహా పలువురు ప్రముఖులు
* పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. PM మోదీ తీవ్ర ఆందోళన
* ఏపీలో రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు
* సంక్రాంతికి HYD-VJA మధ్య టోల్ ‘ఫ్రీ’ అమలు చేయాలంటూ గడ్కరీకి కోమటిరెడ్డి లేఖ
* బనకచర్ల కంటే నల్లమలసాగరే డేంజర్: హరీశ్ రావు
* శ్రీలంక ఉమెన్స్తో 5 T20ల సిరీస్ క్లీన్స్వీప్ చేసిన IND
News December 31, 2025
NTR: ‘డిజిటల్ అరెస్ట్’.. సాంకేతికతతో పటిష్ఠ నిఘా

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘డిజిటల్ అరెస్ట్’ సహా సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతతో పటిష్ఠ నిఘా కొనసాగుతోంది. సైబర్ సురక్ష-కస్టమర్ సైబర్ సేఫ్టీ వెరిఫికేషన్ సిస్టమ్లో భాగంగా Police Analytics Dashboard ద్వారా ఫిర్యాదులు, నమోదులను రియల్టైమ్లో విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవస్థ అమలుతో ప్రజల నుంచి వచ్చే సమాచారం వేగంగా నమోదు కావడంతో మోసాలపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోంది.
News December 31, 2025
వింటర్లో రాత్రుళ్లు చెమటలా? షుగర్ ముప్పు!

చలికాలంలో కూడా రాత్రుళ్లు చెమటలు పడుతుంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్ వచ్చిందనడానికి అది సంకేతం కావొచ్చని చెబుతున్నారు. ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళుతుండడం, నిద్రపోతున్న సమయంలో చేతులు, కాళ్లు జలదరిస్తాయి. అయితే, విటమిన్ B12, నరాల బలహీనత ఉన్నా ఆ సమస్య రావొచ్చని గుర్తుంచుకోండి. షుగర్ను నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాల సమస్య, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.


