News March 26, 2025
సిరిసిల్ల జిల్లాలో ఎక్కువైన ఎండ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండ ఎక్కువైందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రోజు ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 39.0°c, కోనరావుపేట 38.9°c, రుద్రంగి 38.5°c, సిరిసిల్ల 38.4°c, °c,తంగళ్ళపల్లి తంగళ్లపల్లి 37.8°c, వేములవాడ 37.2°c, ఎల్లారెడ్డిపేట 37.2°c,లుగా నమోదు అయ్యాయి. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు సూచనలు జాగ్రత్తగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News March 3, 2026
మరో ఐదు S-400 కొనేందుకు భారత్ ప్లాన్!

డిఫెన్స్ సిస్టమ్స్ బలోపేతంలో భాగంగా భారత్ రష్యా నుంచి మరో ఐదు S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని రక్షణ శాఖ త్వరలో ఆమోదించే అవకాశం ఉంది. S-400తో పాటు పలు మిసైళ్లను కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఆపరేషన్ సిందూర్ టైమ్లో S-400 కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2018లో ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ ఆర్డర్ చేయగా ఇప్పటికి మూడే వచ్చాయి. మరో రెండు రావాల్సింది.
News March 3, 2026
కెనడాతో భారత్ ₹24వేలకోట్ల యురేనియం డీల్

అణుశక్తి కోసం భారత్ కెనడాతో ₹24వేలకోట్ల విలువైన యురేనియం డీల్ కుదుర్చుకుంది. ఆ దేశ ప్రధాని మెక్ కార్నీ భారత్ పర్యటనలో భాగంగా నిన్న దీనిని ఖరారు చేసుకుంది. దీంతో కెనడా ఇకపై భారత్కు యురేనియమ్ను సప్లై చేయనుంది. దేశంలో ఏటా 600 టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతుండగా ఇండియాకు ప్రస్తుతం 1800 టన్నులు అవసరం. 2047 నాటికి భారత్ అణుశక్తి సామర్థ్యం 100 గిగావాట్లకు చేరాలన్న లక్ష్యానికి ఈ డీల్ ఉపయోగపడుతుంది.
News March 3, 2026
ఖమేనీ మృతిపై నిరసనలు.. చాహల్ పోస్ట్

దేశంలో ఖమేనీ మృతిపై పలు చోట్ల నిరసనలు జరగడంపై టీమ్ఇండియా క్రికెటర్ చాహల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘నువ్వు ఉంటున్న దేశాన్ని సపోర్ట్ చేయి లేదంటే నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్లిపో’.. అనే క్యాప్షన్తో ఓ వ్యక్తి టీషర్ట్ ధరించిన ఫొటో తన X అకౌంట్లో పోస్ట్ చేశారు. కాగా అంతకుముందు యాంకర్ రష్మీ సైతం ఈ ఆందోళనలు చేసే వారిని ఇరాన్ పంపించేయాలని ప్రధాని మోదీని కోరుతూ పోస్ట్ చేశారు.


