News February 5, 2025

సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ మహాసభలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ,ఉపాధ్యక్షుడు రాకేశ్, కళ్యాణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 27, 2026

ఏప్రిల్ 21లోగా ఇంటర్ ఫలితాలు!

image

AP: ఇంటర్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్‌ను ఏప్రిల్ 10-14 మధ్య పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 21లోపు ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం. మే తొలి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 10.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

News March 27, 2026

ఖేడ్: వైద్యుల నిర్లక్ష్యం.. విద్యార్థి బొటనవేలు తొలగింపు

image

కంగ్టి మండలం తుకారం తండాలో వైద్యుల నిర్లక్ష్యం ఒక విద్యార్థి జీవితంలో తీరని లోటు మిగిల్చింది. 9వ తరగతి చదువుతున్న సురేష్ కు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు అతని ఎడమ చేతి బొటనవేలును తొలగించాల్సి వచ్చింది. ఈ విషయంపై బీజేపీ, బీఎస్పీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

News March 27, 2026

ధరలను నియంత్రించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం: కేంద్రం

image

ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్‌పై <<19487934>>ఎక్సైజ్ డ్యూటీ<<>> తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్‌కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొన్నారు.