News December 1, 2025

సిరిసిల్ల జిల్లాలో తొలిదశ నామినేషన్లు 385

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 85 గ్రామాల సర్పంచ్ స్థానాలకు 539 నామినేషన్లు దాఖలు కాగా 385 నామినేషన్లను ఆమోదించారు. డబుల్ నామినేషన్ల కారణంగా మిగతా వాటిని తిరస్కరించారు. 748 వార్డులకు 1,696 నామినేషన్లు రాగా, సక్రమంగా లేని కారణంగా ఐదు నామినేషన్లను తిరస్కరించారు. డబుల్ నామినేషన్లు పోగా 1,624 నామినేషన్లను ఫైనల్ చేశారు.

Similar News

News March 29, 2026

మద్యం మత్తులో వాహనం నడపొద్దు: కామారెడ్డి ఎస్పీ

image

కామారెడ్డి జిల్లాలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 553 మంది పట్టుబడ్డారు. వీరికి కోర్టు రూ. 6,38,500 జరిమానా విధిస్తూ, ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష ఖరారు చేసింది. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా మెలగాలని ఆయన కోరారు.

News March 29, 2026

HYD: దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం

image

అత్తాపూర్ PS పరిధిలోని హసన్‌నగర్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన యువతిపై(28) 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు బధిర(మూగ) మహిళ కావడంతో సంకేతాల ద్వారా కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. తక్షణమే కుటుంబ సభ్యులు అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేశారు.

News March 29, 2026

NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో ఎంపీఈడీ, డీపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తామని.. విద్యార్థులు ఏప్రిల్ 8లోపు అప్లై చేసుకోవాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.