News September 10, 2025
సిరిసిల్ల: జిల్లాలో 10,234 ఇండ్ల మంజూరు

చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 10,234 ఇండ్లను మంజూరు చేయగా 5,301 మార్కింగ్ జరిగాయన్నారు. 3,230 బేస్మెంట్ స్థాయికి, 192 గోడల దశకు, 643 రూఫ్ వరకు, ఒక ఇల్లు పూర్తైందన్నారు.
Similar News
News March 4, 2026
వేములవాడ: నేడే అసలైన హోలీ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో హోలీ వేడుకలను బుధవారం జరుపుకోనున్నారు. ఫాల్గుణ పౌర్ణిమ రోజున హోలీ వేడుకలు జరుపుకోవాల్సి ఉండగా, కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా 4వ తేదీ (బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు సూచించారు. ఈ మేరకు బుధవారం వేములవాడతో పాటు అనేక ప్రాంతాల్లో హోలీ జరుపుకోనున్నారు. ప్రభుత్వ సెలవు కారణంగా కొన్ని ప్రాంతాల్లో మంగళవారం హోలీ జరుపుకున్నారు.
News March 4, 2026
ఆయిల్ ధరలు భారీగా తగ్గొచ్చు: ట్రంప్

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక గతంలో కంటే కూడా తగ్గుతాయని భావిస్తున్నాని చెప్పారు. ఇరాన్పై ఇప్పుడు దాడి చేయకపోతే అణుయుద్ధం వచ్చేదన్నారు. కాగా ఇరాన్పై దాడుల్లో సహకరించని స్పెయిన్తో ట్రేడ్ రద్దు చేసుకుంటామన్న ట్రంప్ యూకేపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
News March 4, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 4)

* 1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
* 1973: తెలుగు సినీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం
* 1964: తెలుగు, కన్నడ కవి కిరికెర రెడ్డి భీమరావు మరణం
* 2002: ఒడిశా, బెంగాల్, త్రిపుర మాజీ గవర్నర్ కె.వి.రఘనాథరెడ్డి మరణం (ఫొటోలో కుడివైపు)
* 2016: లోక్సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా మరణం
* జాతీయ భద్రతా దినోత్సవం
* ప్రపంచ ఊబకాయ దినోత్సవం


