News March 28, 2025
సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,750 విద్యార్థులు పరీక్ష రాశారు. 14 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేదని తెలిపారు.
Similar News
News October 21, 2025
శివోహం.. అనంతపురం జిల్లాలో దర్శనీయ శివాలయాలు

రేపటి నుంచి కార్తీకమాసం. ఈ నెలలో అనంతపురం జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
★ తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి
★ కూడేరు జోడి లింగాల క్షేత్రం
★ పామిడి భోగేశ్వర స్వామి
★ లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం
★ అమరాపురం సిద్దేశ్వర స్వామి, కంబదూరు మల్లేశ్వర స్వామి
★ గార్లదిన్నె కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
★ బుక్కరాయసముద్రం కాశీ విశ్వనాథ క్షేత్రం
★ బత్తలపల్లిలో కాటి కోటేశ్వర స్వామి క్షేత్రం
News October 21, 2025
సమాజాన్ని మేలుకొల్పే చిత్రాలకు చిరునామా ఆయన

సామాజిక అంశాలనే కథాంశంగా సంచలన సినిమాలు తీసిన దర్శకుడిగా టి.కృష్ణ పేరొందారు. విజయశాంతిని స్టార్ను చేసిన ‘ప్రతిఘటన’ చిత్రానికి ఆయనే డైరెక్టర్. నేటి భారతం, వందేమాతరం, దేవాలయం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, అర్ధరాత్రి స్వతంత్రం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన 1987లో కన్నుమూశారు. హీరో గోపీచంద్ ఈయన కుమారుడే. ఇవాళ టి.కృష్ణ వర్ధంతి.
News October 21, 2025
ఖమ్మం: పోలీసు అమరులకు సెల్యూట్.. త్యాగం గొప్పది

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం గొప్పదని ఖమ్మం, భద్రాద్రి జిల్లా వాసులు స్మరించుకుంటున్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నేడు వారికి నివాళులు అర్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో నక్సలైట్ల దాడుల్లో అనేక మంది పోలీసులు వీరమరణం పొందారు. 1997లో కరకగూడెం ఠాణాపై దాడిలో 16 మంది, 1991లో రాళ్లవాగు, 1992లో మోతుగూడెం ఘటనల్లో అమరులైన వారి సేవలు భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.