News February 8, 2025
సిరిసిల్ల: ట్రాక్టర్లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.
Similar News
News March 29, 2026
KKR విధ్వంసం.. ఒకే ఓవర్లో 26 పరుగులు

MIతో జరుగుతున్న మ్యాచులో KKR ఓపెనర్లు రహానే, అలెన్ విరుచుకుపడుతున్నారు. హార్దిక్ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 26 రన్స్ బాదారు. తొలుత రహానే 2 సిక్సులు కొట్టగా, అలెన్(37) 3 ఫోర్లు బాదారు. ఒక వైడ్, లెగ్ బైస్ ద్వారా పెద్ద ఓవర్గా మారింది. దీంతో 4 ఓవర్లు ముగిసే లోపే జట్టు స్కోర్ 50 పరుగులు దాటింది. MIపై KKRకు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.
News March 29, 2026
వరదలు ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు: పోలవరం కలెక్టర్

వరదలు ఎదుర్కొనే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కే దినేష్ కుమార్ ఆదివారం అన్నారు. చింతూరు ఐటీడీఏలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు వరదల సమయంలో ప్రజలకు మూడు నెలల రేషన్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద హెచ్చరికలు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో అడిగి తెలుసుకున్నారు.
News March 29, 2026
మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమీక్ష

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు. అసెంబ్లీ కమిటీ హాలులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్ నిధులు, ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇరిగేషన్, టూరిజమ్ అధికారులు పాల్గొన్నారు.


