News September 17, 2025

సిరిసిల్ల : తొలితరం పోరాట యోధుడు రావుల నరసింహ రెడ్డి

image

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన తొలితరం యోధుడు రావుల నరసింహ రెడ్డి. రాజన్న సిరిసిల్లి జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఈయన 1949 ప్రాంతంలో ప్రజల కష్టాలను చూసి పోరాటంలో భాగమయ్యారు. పేదల కోసం అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఆయనను ఒక గొప్ప వీరుడిగా గుర్తుంచుకుంటారు.

Similar News

News September 17, 2025

KNR: గంటకు రూ.400 అద్దె.. ఈజీగా 4- 5 ఎకరాలకు

image

ఏరువాక పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో జిల్లాలోని రైతులు పొలాల్లో మందుల పిచికారీ కోసం నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్లలను ఆశ్రయిస్తున్నారు. రూ.400 అద్దె చెల్లించి గంట వ్యవధిలో 4- 5 ఎకరాలకు సులువుగా పిచికారీ చేస్తున్నారు. దీనికి డిమాండ్ పెరగటంతో డ్రోన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు శంకరపట్నం, మానకొండూర్, జమ్మికుంట, PDPL జిల్లాల నుంచి వీటిని తెప్పించుకుంటున్నారు.

News September 17, 2025

ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

image

ఈ నెల 19వ తేదీ శుక్ర‌వారం ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.రామ‌సుంద‌ర్ రెడ్డి బుధవారం తెలిపారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఈ కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొంటార‌ని వెల్లడించారు. ఉద్యోగులు త‌మ స‌మ‌స్య‌ల‌పై ఈ గ్రీవెన్స్‌లో ధ‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయ‌వ‌చ్చున‌ని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.

News September 17, 2025

ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో MLA, ఉన్నతాధికారులు

image

ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలపై వివరించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.