News March 3, 2025
సిరిసిల్ల: దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి 108 దరఖాస్తులు వచ్చాయి.
Similar News
News November 18, 2025
ములుగు: మావోయిస్టు హిడ్మా నేపథ్యం!

ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. సుక్మాలోని పూర్వర్తికి చెందిన మడవి హిడ్మాపై రూ.కోటి రివార్డు సైతం ఉంది. చిన్నతనంలోనే మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. ఏరియా కమిటీలో, DVCM(డివిజనల్ కమిటీ సభ్యుడు), DKSZC(దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ) తర్వాత సీసీ కమిటీ మెంబర్గా ప్రస్తుతం కొనసాగాడు.
News November 18, 2025
ములుగు: మావోయిస్టు హిడ్మా నేపథ్యం!

ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. సుక్మాలోని పూర్వర్తికి చెందిన మడవి హిడ్మాపై రూ.కోటి రివార్డు సైతం ఉంది. చిన్నతనంలోనే మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. ఏరియా కమిటీలో, DVCM(డివిజనల్ కమిటీ సభ్యుడు), DKSZC(దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ) తర్వాత సీసీ కమిటీ మెంబర్గా ప్రస్తుతం కొనసాగాడు.
News November 18, 2025
HYD: YCP అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్

YCP కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు అయ్యారు. కూకట్పల్లిలోని తన ఇంట్లో ఉ.7 గం.కు పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేసి, ఫోన్లు లాక్కొని అమానుషంగా ప్రవర్తించారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. ప్రస్తుతం తాడిపత్రికి తరలిస్తున్నారు. స్థానిక పార్టీ నేతలు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.


