News December 25, 2025

సిరిసిల్ల: ధాన్యం కొనుగోలు కమీషన్ చెక్కుల పంపిణీ

image

జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2023-24 సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 30 శాతం కమీషన్ రూ.1,90,73,487, అలాగే రబీ సీజన్లో 2023- 24లో 2,62,446 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 100 శాతం కమీషన్ రూ.7,86,91,920 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పంపిణీ చేశారు.

Similar News

News December 27, 2025

నెల్లూరులో ఫేక్ ITCలతో రూ. 43 కోట్ల టోకరా !

image

నెల్లూరులో పెద్ద పెద్ద కంపెనీలు పన్నుల ఎగవేతకు కొత్త పంథాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ జేసీ కిరణకుమార్ Way2Newsతో మాట్లాడుతూ.. నెల్లూరు డివిజన్ పరిధిలో రూ. 43 కోట్ల మేరా ఫేక్ ITC లను తీసుకున్నారని తెలిపారు. 8 సంస్థలపై కేసులు నమోదు చేశామని, ఇందులో ఐదుగురిపై కేసులు నమోదు చేయగా.. ముగ్గురు 10% డిమాండ్ కట్టి అప్పీల్ కి వెళ్లారని వివరించారు.

News December 27, 2025

ఏలూరు జిల్లాలో ఒక రోజు ముందే రూ.113 కోట్ల పంపిణీ

image

జనవరి నెల సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,59,151 లక్షల మంది పెన్షన్ దారులకు 113.68 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పెన్షన్ 31వ తేదీన 100% పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 31న తీసుకొని వారికి 2వ తేదీన పంపిణీ చేస్తారన్నారు.

News December 27, 2025

అల్లు అర్జున్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?

image

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనపై పోలీసులు <<18684964>>ఛార్జ్‌షీట్<<>> దాఖలు చేయడంపై మరోసారి హీరో అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను ఏ-11గా పేర్కొనడంతో బన్నీని మళ్లీ అరెస్ట్ చేస్తారా? అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఛార్జ్‌షీట్ అనేది కేసు పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించే నివేదిక. ఇక్కడ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అందులో పేర్కొనడంతో బన్నీ అరెస్ట్ ఉండకపోవచ్చు!