News October 31, 2025

సిరిసిల్ల: నిద్రలోనే కన్నుమూసిన మహిళ

image

ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసిన ఘటన సిరిసిల్ల(D) గంభీరావుపేట మండలం దోసెలగూడెంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల లక్ష్మణ్ భార్య లక్ష్మి(48) హఠాత్తుగా నిద్రలోనే కన్నుమూశారు. కాగా, ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు స్థానికులు అంటున్నారు. మృతురాలి భర్త కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కావడంతో భారీసంఖ్యలో నాయకులు, స్థానికులు ఆయన నివాసానికి చేరుకుని ఓదార్చారు.

Similar News

News October 31, 2025

RSSను బ్యాన్ చేయాల్సిందే: ఖర్గే

image

దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టిస్తున్నందుకు RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ మ్యాన్, ఐరన్ లేడీ ఇద్దరూ భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం పని చేశారని చెప్పారు. దేశంలో చాలా సమస్యలకు BJP-RSSనే కారణమని ఆరోపించారు. 1948లో గాంధీ హత్య తర్వాత RSSను పటేల్ నిషేధించారని చెప్పారు.

News October 31, 2025

విడిపోతున్నారా? పిల్లలు జాగ్రత్త

image

దంపతులు తమ విడాకుల విషయాన్ని చెబితే పిల్లలు ఎంతోకొంత ఒత్తిడికి గురవడం సహజం. కొందరు చిన్నారులు పరిస్థితుల్ని త్వరగా అర్థం చేసుకుంటే.. మరికొందరికి సమయం పడుతుంది. కాబట్టి త్వరగా అర్థం చేసుకోమని, మారమని వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. ఆయా పరిస్థితులకు తగినట్లుగా అడ్జస్ట్ అయ్యే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే వారు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ఓర్పు, నేర్పు వస్తుందంటున్నారు నిపుణులు.

News October 31, 2025

మెదక్‌తో ఇందిరాగాంధీకి అవినాభావ సంబంధం

image

మెదక్‌ ఎంపీగా గెలుపొందిన ఇందిరాగాంధీకి ఉమ్మడి జిల్లాలో అవినాభావ సంబంధం ఉంది. ఎంపీగా మెదక్‌‌కు వచ్చి వెళ్లేటప్పుడు చిన్నశంకరంపేట అతిథి గృహంలో బస చేసినట్లు స్థానిక నాయకులు ఆనాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. అలాగే 984లో జరిగిన మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ సర్పంచ్‌‌ల సదస్సు, సంగారెడ్డిలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మెదక్‌లో మున్సిపల్‌ షాపింగ్‌‌ కాంప్లెక్స్‌‌ పనులకు శంకుస్థాపన చేశారు.