News August 21, 2025
సిరిసిల్ల: ’నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’

గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని SP కార్యాలయంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. మండపాలు ప్రజా రవాణా, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బందులేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకుల బాధ్యత వహించే వారి ఫోన్ నెంబర్లు మండపాలలో ఏర్పాటు చేయాలన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News August 21, 2025
ఆ ట్రస్ట్ సేవలు అభినందనీయం: కలెక్టర్

తాడేపల్లిగూడెం మండలం అలంపురంలోని ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్ను కలెక్టర్ నాగరాణి గురువారం సందర్శించారు. హాస్పిటల్ ద్వారా రోగులకు అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వివిధ విభాగాలను, వైద్య పరికరాలను పరిశీలించి ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. హాస్పిటల్ను కొనుగోలు చేసిన నాలుగు ఎకరాల విస్తీర్ణాన్ని పరిశీలించారు.
News August 21, 2025
పద్ధతి మార్చుకోకపోతే.. జాబ్ నుంచే తొలగిస్తా: కలెక్టర్ వార్నింగ్

విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారికి ఉద్యోగం ఎందుకు? పద్ధతి మార్చుకోకపోతే టెర్మినేట్ చేసేస్తా అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. వాస్తవ వివరాలను నమోదు చేయకుండా పలువురు ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు.
News August 21, 2025
NLG: దెబ్బతిన్న రోడ్లపై మంత్రి సమీక్ష

హ్యామ్ రోడ్లు, నేషనల్ హైవేలకు సంబంధించిన అంశాలతోపాటు, ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో కోమటిరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఈఎన్సీ జయభారతి, సీఈ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.