News March 15, 2025
సిరిసిల్ల: పండుగ పూట విషాదం.. నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లాలో శుక్రవారం వేర్వేరు ఘటనలో నలుగురు చనిపోయారు. PDPL జిల్లా కమాన్పూర్(M) గుండారంకు చెందిన ఓదెలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. JGTL రూరల్(M) వెల్దుర్తిలోని కెనాల్లో ఈతకు వెళ్లి సాగర్గౌడ్ చనిపోయాడు. KNR జిల్లా ఇల్లందకుంట(M) చిన్నకోమటిపల్లిలో బైక్ అదుపుతప్పి JMKTకు చెందిన అనుదీప్ మృతిచెందాడు. SRCL జిల్లా చందుర్తికి చెందిన <<15754680>>వామిక<<>> అనే 16 నెలల చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది.
Similar News
News November 5, 2025
రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.
News November 5, 2025
కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: MLC బొత్స

కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో రైతులు నష్టపోయినా ఇప్పటి వరకూ స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగితే ప్రైవేట్ ఆలయం అంటారా? ఎక్కడైనా జనం ఎక్కువగా ఉంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినప్పుడల్లా ఏదో ఒక డైవర్షన్ తీసుకొస్తున్నారని అన్నారు.
News November 5, 2025
సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలి: ADB SP

డయల్ 100 సిబ్బంది పటిష్టమైన సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం పోలీస్ హెడ్ కోటర్స్ సమావేశ మందిరంలో జిల్లాలోని బ్లూ కోర్ట్, డయల్ 100 సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిరంతరం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ఉండాలని, డయల్ 100 సేవలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రాత్రుళ్లు గస్తీ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.


