News January 28, 2025

సిరిసిల్ల: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు ఎస్పీ

image

బ్యాంకుల వద్ద పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేయాలని అదనపు ఎస్పీ డి.చంద్రయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బ్యాంకు బ్రాంచ్‌లు, ఏటీఎంల భద్రతపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్ వద్ద ఎలక్ట్రానిక్ అలారం సిస్టం అందుబాటులో ఉండాలన్నారు. బ్యాంకు కార్యాలయాలు, ఏటీఎం సెంటర్ల వద్ద తప్పనిసరిగా పనిచేసే సీసీ కెమెరాలు ఉండాలని సూచించారు.

Similar News

News September 17, 2025

విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

image

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్‌పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.

News September 17, 2025

సోషల్ మీడియా పోస్టుకి స్పందించిన DyCM పవన్ కళ్యాణ్

image

ట్విట్టర్‌(X)లో ఒక సామాన్యుడు పెట్టిన పోస్టుకు DyCM పవన్ కళ్యాణ్ స్పందించారు. గుంతలమయంగా మారిన ఏలేశ్వరం – అడ్డతీగల రోడ్డు దుస్థితిపై చైతన్య రాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ ఈ పోస్టుకు స్పందించి, తక్షణ మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులతో రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News September 17, 2025

76వ వసంతంలోకి ప్రధాని మోదీ

image

ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేడు 76వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఓ సాధారణ కుటుంబం నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశానికి ప్రధానిగా ఎదిగారు. గుజరాత్‌కు 13 ఏళ్లు సీఎంగా చేశారు. 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రశంసలతో పాటు విమర్శలనూ ఎదుర్కొన్నారు. ప్రధానిగా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. Happy Birthday PM Narendra Modi.