News September 18, 2024

సిరిసిల్ల: పత్తి దిగుబడిపై దిగాలు

image

సిరిసిల్ల జిల్లాలో పత్తి పంట సాగు చేసిన రైతులు తెల్లబోతున్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన అధిక వర్గాలు పత్తి రైతులను పరేషాన్ చేస్తున్నాయి. భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపింది. మరోవైపు తెగుళ్లు మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకులకు తెగుళ్లు సోకి ఎర్ర రంగులోకి మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాగా, జిల్లాలో 49,332 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.

Similar News

News October 3, 2024

KNR: గడ్డి మందు తాగి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

image

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సై తోట తిరుపతి వివరాల ప్రకారం.. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి(27) ఉద్యోగం వచ్చినప్పటికీ పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత నాలుగేళ్లుగా హుజురాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. మృతుడి తండ్రి సంపత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 3, 2024

సభ్యత్వ నమోదుపై కేంద్ర మంత్రి బండి రివ్యూ సమావేశం

image

కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డితో కలిసి సమావేశమై చర్చించారు. అధిక బీజేపీ సభ్యత్వ నమోదులపై దృష్టి సారించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

News October 3, 2024

గాంధీ జయంతి సందర్భంగా వికలాంగులకు స్కూటీల పంపిణీ

image

మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా హుస్నాబాద్‌లో వికలాంగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూటీలు పంపిణీ చేశారు. ముందుగా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వికలాంగులై ఉండి రానివారికి మరొక విడుతలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, మునిసిపల్ చైర్మన్ ఆకుల లలిత, వైస్ చైర్మన్ అనిత పాల్గొన్నారు.