News March 21, 2025
సిరిసిల్ల: పది పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి.!

నేటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలో పదోతరగతిలో 3051 బాలురు, బాలికలు మొత్తం 6768 మంది విద్యార్థులు రాయనున్నట్లు తెలిపారు. వీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 21, 2026
బడ్డీ వద్ద బజ్జీలు వేసిన హోంమంత్రి అనిత

ఉపమాకలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను హోంమంత్రి అనిత శనివారం పరిశీలించారు. ఆసమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను మంత్రికి తీసుకువచ్చి అందజేశారు. వాటిని రుచి చూసిన మంత్రి స్వయంగా షాప్ వద్దకు వెళ్లి కొద్దిసేపు బజ్జీలు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
News February 21, 2026
చీపురు పట్టిన నంద్యాల కలెక్టర్

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని గుర్తు చేయాల్సిన అవసరం ఉందని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శుభ్రత పనులను పరిశీలించారు. అనంతరం చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. జీవిత విధానంలో శుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు.
News February 21, 2026
వికసిత్ భారత్కు ‘మేడ్ ఇన్ ఇండియా చిప్స్’ కీలకం: మోదీ

IND అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి స్వయంసమృద్ధి సాధించడం కీలకమని PM మోదీ తెలిపారు. ఫాక్స్కాన్, HCL యూపీలో ఏర్పాటుచేయనున్న సెమీకండక్టర్ పరిశ్రమకు వర్చువల్గా ఆయన శంకుస్థాపన చేశారు. ‘కరోనా టైమ్లో చిప్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో అనేక ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. వికసిత్ భారత్కు మేడ్ ఇన్ ఇండియా చిప్స్ ముఖ్యం. ఈ దశాబ్దంలో నిర్ణయాలు 21వ సెంచరీలో సామర్థ్యాలకు పునాదులవుతాయి’ అని పేర్కొన్నారు.


