News January 30, 2025

సిరిసిల్ల: పార అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటిన సక్కు బాయి

image

వీర్నపల్లి మండలం జవహర్ లాల్ నాయక్ తండాకు చెందిన బి.సక్కు బాయి 7వ తెలంగాణ పార అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సక్కు బాయిని ఈ రోజు స్ధానికులు అభినందించారు. అమె హైదరాబాద్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా తరపున పార అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఈ నెల 27,28 తేదీలో రెండు విభాగంలో డిస్కస్ త్రో, షాట్ పుట్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచారు.

Similar News

News November 6, 2025

NZB: కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయండి: DRDO

image

జిల్లాల్లో కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని NZB DRDO సాయాగౌడ్ ఆదేశించారు. గురువారం NZB కలెక్టరేట్‌లో NZB, KMR, ADB, MDK, నిర్మల్ జిల్లాల DPM, DAPMలకు హెల్త్ అండ్ న్యూట్రీషియన్, బాలికల సంఘాల ఏర్పాటు అంశాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడారు.. కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి వారికి మండల, గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్స్, ANMలతో సమన్వయం చేయాలని సూచించారు.

News November 6, 2025

ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి: NZB కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్, HMలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్‌లో నిక్షిప్తం చేయిస్తోందన్నారు.

News November 6, 2025

రేపు ‘వందేమాతరం’ సామూహిక గీతాలాపన: NZB కలెక్టర్

image

వందేమాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని శుక్రవారం సామూహిక గీతాలాపన ఉంటుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. వందేమాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని విధిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆలపించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.