News November 10, 2025
సిరిసిల్ల: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మం.లో సోమవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. తంగళ్లపల్లిలోని తన ఇంటి వద్ద మచ్చ జలంధర్(70) తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో అతడి శరీరం బాగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివారలు సేకరిస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. ఎన్ని పనులున్నా ఓటేసి వెళ్లండి..!

గుర్తుందా.. రేపు నవంబర్ 11.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరిగే రోజు.. మీకు ఎన్ని పనులున్నా.. మీరు ఎంత బిజీ ఉన్నా.. రేపు మాత్రం ఓటేసిన తరువాతే పనులు చూసుకోండి..”ముఖ్యమైన పనులున్నాయి.. వీలుకాదు.. మన ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది” అని అనుకోకండి.. అందరూ ఇలా అనుకుంటే ఇక ఓట్లు ఎవరు వేస్తారు? పనులు అందరికీ ఉంటాయి.. అవసరమైతే వాయిదా వేసుకోండి.. ఓటు వేయండి.. ప్లీజ్.
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. ఎన్ని పనులున్నా ఓటేసి వెళ్లండి..!

గుర్తుందా.. రేపు నవంబర్ 11.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరిగే రోజు.. మీకు ఎన్ని పనులున్నా.. మీరు ఎంత బిజీ ఉన్నా.. రేపు మాత్రం ఓటేసిన తరువాతే పనులు చూసుకోండి..”ముఖ్యమైన పనులున్నాయి.. వీలుకాదు.. మన ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది” అని అనుకోకండి.. అందరూ ఇలా అనుకుంటే ఇక ఓట్లు ఎవరు వేస్తారు? పనులు అందరికీ ఉంటాయి.. అవసరమైతే వాయిదా వేసుకోండి.. ఓటు వేయండి.. ప్లీజ్.
News November 10, 2025
రైల్వే డీఆర్ఎంతో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశం

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సోమవారం డివిజన్లో అభివృద్ధి పనులపై ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాతో సమావేశమయ్యారు. అనంతరం రైల్వే డివిజన్లో రైల్వే స్టాపింగ్స్, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్ట్, రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు మొదలైన అంశాలపై చర్చించారు.


