News October 19, 2025
సిరిసిల్ల: ప్రభుత్వ జాప్యం.. దళారుల చేతికి ధాన్యం

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జాప్యమైతున్న కారణంగా రైతులు దళారులకు ధాన్యం అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో జిల్లాలో మొత్తం 1,84,360 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 9,480 ఎకరాల్లో సన్న రకం,1,74,880 ఎకరాల్లో దొడ్డు రకం వేశారు.17,064 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం,4,37,200 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం మొత్తం 4,54,264 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అన్నారు.
Similar News
News October 21, 2025
జగిత్యాల: ఉరివేసుకొని యువకుడి సూసైడ్

జగిత్యాల(D) ధర్మపురి మండలం దమ్మన్నపేటకి చెందిన జగిశెట్టి సచిన్(29) ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సచిన్కు చిన్నతనంలో చేతికి తగిలిన గాయం కారణంగా ప్రస్తుతం ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఇందుకోసం హైదరాబాద్లో వైద్యం చేయించారు. 6 నెలల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే అనారోగ్యం కారణంతో సచిన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
News October 21, 2025
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధుల్లో అమరులైన పోలీసులకు ఎస్పీ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
News October 21, 2025
పార్వతీపురం: ‘అమరవీరుల త్యాగాలు మరువలేనివి’

పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఎం.ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో వారు పాల్గొన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎన్నో సమస్యలు ఎదుర్కొని అంకితభావంతో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా విధుల్లో మృతిచెందిన అమరవీరులకు స్థూపం వద్ద నివాళులర్పించారు.