News March 6, 2025

సిరిసిల్ల: ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వ్యక్తి మృతి

image

ఇల్లంతకుంట మండలంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయిన ఘటన గురువారం చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం శీలం రజినీకాంత్(26) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెద్ద లింగాపూర్ గ్రామ శివారులో బావిలో పడి మృతి చెందాడు. స్థానిక సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 7, 2025

మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు ద్వారా తీసుకునే రుణాలు.. అమరావతిలో భూముల అమ్మకంతో వచ్చే నిధులనే రాజధాని కోసం వాడతామన్నారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్కపైసా కూడా వాడబోమని వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కుల వంటి వసతులు పూర్తైతే భూముల ధర పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాజధానిపై YCP ఓ విధానంతో ముందుకు రావాలని హితవు పలికారు.

News March 7, 2025

TODAY HEADLINES

image

☛ తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: చంద్రబాబు
☛ APకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల
☛ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలి: జగన్
☛ SC వర్గీకరణ ముసాయిదా బిల్లుకు TG క్యాబినెట్ ఆమోదం
☛ రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ BJPదే గెలుపు: KTR
☛ TG: ఈనెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ UKలో విదేశాంగ మంత్రి జైశంకర్‌పై దాడికి యత్నం
☛ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సునీల్ ఛెత్రి

News March 7, 2025

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

image

*HYDలో మిస్ వరల్డ్ పోటీల ఆతిథ్యానికి ఆమోదం
*ORRకు ఇన్నర్ సైడ్ ప్రాంతం కోర్ తెలంగాణ.. ORR నుంచి RRR వరకు అర్బన్ తెలంగాణ. మిగతా ప్రాంతమంతా రూరల్ తెలంగాణ
*సెర్ప్, మెప్మాల విలీనం
*మహిళా సంఘాల వయోపరిమితి 15-65 ఏళ్లుగా నిర్ణయం
*డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం
*యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

error: Content is protected !!