News April 7, 2025

సిరిసిల్ల: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

image

ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.

Similar News

News April 14, 2025

ఇంగ్లిష్ పుస్తకాలకు హిందీ పేర్లు.. NCERT వివాదాస్పద నిర్ణయం

image

ఇంగ్లిష్ పుస్తకాలకు NCERT హిందీ పేర్లు పెట్టడం వివాదాస్పదమైంది. గతంలో 6వ తరగతి టెక్ట్స్‌బుక్ పేరు ఇంగ్లిష్‌లో ‘Honeysuckle’ అని ఉండగా హిందీలో ‘పూర్వీ’ అని మార్చింది. ఇది సంగీత రాగం పేరు. 1,2 తరగతుల పుస్తకాలకు మృదంగ్, 3rd క్లాస్ బుక్స్‌కు సంతూర్ అని పేర్లు పెట్టింది. ఇవి సంగీత పరికరాలు. తమిళనాడు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ NCERT పేర్లను మార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

News April 14, 2025

BREAKING: పటాన్‌చెరు: రోకలిబండతో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

image

పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను రోకలిబండతో కొట్టి భర్త రమేష్ హతమార్చాడు. భార్య భర్తల మధ్య గొడవ జరగగా అడ్డువచ్చిన అత్త కవితపై కూడా రమేష్ దాడికి పాల్పడ్డాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా..అత్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2025

శ్రీకాకుళంలో సైనిక్ భవన్ శంకుస్థాపన 

image

శ్రీకాకుళం కేంద్రంలో రాగోలులో సైనిక్ భవన్‌ నిర్మాణం సోమవారం జరిగింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భూమి పూజలకు హాజరై శంకుస్థాపన చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ సైనకులు పాల్గొన్నారు.

error: Content is protected !!