News March 17, 2025
సిరిసిల్ల: బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే: ఎస్పీ

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్లజిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల 18 ఫిర్యాదులను స్వీకరించారు.
Similar News
News November 4, 2025
బాల్య వివాహాలను నిర్మూలించడం ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్

బాల్య వివాహాలను నిర్మూలించడం ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాల నిండకుండా పెళ్లి చేయడం నేరమని చెప్పారు. బాల్య వివాహన చట్టం ప్రకారం బాల్య వివాహాలను చేస్తే తల్లిదండ్రుల పైనే కాకుండా వివాహానికి హాజరైన వారు, ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులేనని తెలిపారు.
News November 4, 2025
CSIR-NIOలో 24 ఉద్యోగాలు

CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(<
News November 4, 2025
నా భార్యను తాళి వేసుకోవద్దనే చెప్తా: రాహుల్

రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్లో రాహుల్ మాట్లాడారు. ‘పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. నేను తాళి వేసుకోవద్దనే చెప్తా. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళి ఉన్నట్లు అబ్బాయిలకు ఎలాంటి ఆధారం లేదు. ఇది ఒక వివక్ష లాంటిదే’ అని చెప్పారు.


