News December 1, 2025
సిరిసిల్ల: ‘బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం’

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News April 5, 2026
MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
News April 5, 2026
పేదల న్యాయం కోసం జగ్జీవన్ రామ్ కృషి: ఎస్పీ స్నేహ మెహ్రా

బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అందరికీ సమానత్వం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పనిచేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.
News April 5, 2026
జగన్ అబద్ధం ఆడుతున్నారు: TDP

AP: రాజధాని అమరావతిలో చదరపు అడుగుకు రూ.12,000 ఖర్చవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నారని TDP ఓ ఫొటోను ట్వీట్ చేసింది. అలా అనుకున్నా విలాసాలకు ఆయన కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ చ.అడుగుకి రూ.35,714 అయ్యిందని విమర్శించింది. దీనికి జగన్ ఏమని జవాబు చెబుతారని ప్రశ్నించింది. ఇక అబద్ధంతో బతుకుతూ, విద్వేషం చిమ్ముతూ అమరావతి విషయంలో ఒక్కడినే ఇంకో వైపు అనుకోవటం మానసిక స్థితిని తెలియజేస్తుందని ఎద్దేవా చేసింది.


