News July 8, 2025

సిరిసిల్ల: ‘బాధితుల సమస్యలు పరిష్కరించడమే గ్రీవెన్స్ డే లక్ష్యం’

image

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 23 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News July 8, 2025

ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు: లోకేశ్

image

AP: MLA ప్రశాంతిరెడ్డిపై YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైరయ్యారు. వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణమన్నారు. ‘YCP నేతలకు మ‌హిళలంటే ఇంత ద్వేష‌భావ‌మా? త‌ల్లి, చెల్లిని త‌రిమేసిన జ‌గ‌న్‌ గారిని ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టున్నారు. మ‌హిళ‌ల జోలికి వస్తే ఊరుకునేందుకు ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు.. మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచే ప్ర‌జాప్ర‌భుత్వం’ అని వ్యాఖ్యానించారు.

News July 8, 2025

ఫోర్త్ సిటీ: దేశంలో అతిపెద్ద స్టేడియం!

image

TG: CM రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీలో భాగ్యనగర ఇబ్బందులు లేకుండా నిపుణులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత MGBS-చాంద్రాయణగుట్ట మెట్రో రూట్‌ను అక్కడి నుంచి ఫోర్త్ సిటీకి విస్తరించే పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇక కొత్త నగరంలో స్పోర్ట్స్ హబ్ ఉంటుందని CM ఇప్పటికే ప్రకటించగా, ఇందులో భాగంగా దేశంలో అతిపెద్ద స్టేడియాన్ని ఇక్కడ నిర్మిస్తారని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.

News July 8, 2025

గోదావరిఖని: రేపు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె

image

రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు విధానాలను అవలంబిస్తుందని వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే RGM పారిశ్రామిక ప్రాంతంలోని భారీ పరిశ్రమలైన SCCL, NTPC, RFCLలకు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఇదిలా ఉంటే, సమ్మె వల్ల జరిగే నష్టాన్ని కార్మిక వర్గానికి వివరిస్తూ సమ్మెకు దూరంగా ఉండాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.