News October 10, 2025
సిరిసిల్ల: భార్య లేదని వృద్ధుడు ఆత్మహత్య

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. SI రాహుల్ రెడ్డి దీనిపై కేసు నమోదు చేశారు. పోతు అంజయ్య(70) కొద్ది నెలలుగా మూత్ర, మలవిసర్జన వ్యాధితో బాధపడుతున్నాడు. మృతుడి భార్య ఏడాది క్రితం చనిపోయింది. అనారోగ్య సమస్యలతో పాటు భార్య లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన అంజయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అక్క కళావతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 10, 2025
విశాఖ: హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

విశాఖ వేదికగా VCA – ADCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 12న (ఆదివారం) ఇండియా V/S ఆస్ట్రేలియా ఉమెన్స్ తలపడనున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ జరిగిన మ్యాచులో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ చేతిలో ఇండియా ఉమెన్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆదివారం సెలవు రోజు కావటంతో అధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
News October 10, 2025
తిరుపతి గరుడ వారధిపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

తిరుపతి లక్ష్మీపురం కూడలి వద్ద గరుడ వారధిపై శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు బైకుపై వెళ్తూ సేఫ్టీ వాల్ను బలంగా ఢీకొట్టి కింద పడిపోయారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 10, 2025
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపును శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దివ్యాంగుల పెన్షన్ కోసం రీ అసెస్మెంట్లో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు సదరం క్యాంప్ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రోగులతో ఆప్యాయంగా మాట్లాడి సేవలందించాలని కలెక్టర్ తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.