News April 10, 2025

సిరిసిల్ల: మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు నలుగురు మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అపెరల్ పార్క్‌లో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం చేస్తారన్నారు.

Similar News

News April 14, 2026

సిద్ధు జొన్నలగడ్డతో Freedom oil కొత్త టీవీ ప్రకటన

image

Freedom రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తమ సరికొత్త ప్రచార చిత్రాన్ని ప్రముఖ నటుడు సిద్ధు జొన్నలగడ్డతో విడుదల చేసింది. ‘ఫ్రీడమ్‌తో ఇంటింటా, నెం.1 వంట’ అనే నినాదంతో రూపొందిన ఈ ప్రకటన తెలుగు కుటుంబాల వంటగదిలోని ఆప్యాయతను, సందడిని ఆవిష్కరిస్తోంది. వంట చేయడం అనేది ఒక వేడుక అని చాటిచెప్పే ఈ వీడియోలో సిద్ధు తనదైన శైలిలో ఉత్సాహంగా కనిపించారు. నాణ్యమైన రుచికి Freedom బ్రాండ్ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

News April 14, 2026

GNT: అమరావతిలో ‘మినీ ఢిల్లీ’

image

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరనున్నాయి. దీంతో రాజధాని ‘మినీ ఢిల్లీ’ని తలపించనుంది. సెంట్రల్ సెక్రటేరియట్ కోసం కేంద్రం రూ. 2,534 కోట్లు కేటాయించింది. రూ. 1,299 కోట్లతో 5.53 ఎకరాల్లో సచివాలయం కడతారు. రూ. 1,235 కోట్లతో 17 ఎకరాల్లో కేంద్ర ఉద్యోగులకు ఇళ్లు నిర్మిస్తారు. అలాగే హడ్కో ఆధ్వర్యంలో 10 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ కూడా రానుంది.

News April 14, 2026

భద్రాద్రి ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి

image

కొత్తగూడెం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.