News April 3, 2025

సిరిసిల్ల: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.

Similar News

News February 18, 2026

కాంగ్రెస్‌లో రాజ్యసభ సీట్లు దక్కేదెవరికో?

image

TG: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డంతో రాష్ట్రంలోని 2 సీట్లు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరందుకుంది. MLAల సంఖ్య ప్రకారం INCకే ఇవి దక్కవచ్చంటున్నారు. ఆ పార్టీ నుంచి K.కేశవరావు, అభిషేక్ సింఘ్వీ, జీవన్ రెడ్డి, హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో BRS RS సభ్యుడిగా ఉన్న KK రాజీనామా చేసి INCలో చేరారు. VH, జీవన్, సుదర్శన్‌లు సీనియర్లు. సింఘ్వీ AICCలో కీలకంగా ఉన్నారు.

News February 18, 2026

సిద్దిపేట: 51 ఏళ్ల తర్వాత.. గురువులకు సన్మానం

image

గురుశిష్యుల బంధానికి ఈ ఘటన ఒక నిదర్శనం. 51 ఏళ్ల క్రితం తమకు పాఠాలు బోధించిన లెక్చరర్లను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఏడు పదుల వయసు దాటిన మాజీ విద్యార్థులంతా కలిసి ఐఐటీ రామయ్య(Maths), మధుసూదన్(Physics), నాగేశ్వర్ రావు(Chemistry)లను ఆత్మీయంగా సత్కరించారు. సిద్దిపేటకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వినూత్న వేడుకలో పాల్గొని తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

News February 18, 2026

వరి పంటలో ఎలుకల నిర్మూలనకు అనుకూల సమయం ఏది?

image

వరిలో నాట్లు వేసిన తర్వాత ఎలుకల నిర్మూలన చేపట్టడం సులభమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో బుట్టలను పెడితే ఎలుకలను సులభంగా నిర్మూలించవచ్చంటున్నారు. పంట చిరుపొట్ట దశలో ఎలుకల నిర్మూలన కష్టంగా మారుతుందని, ఈ సమయంలో బుట్టలతో వాటిని అరికట్టలేమని చెబుతున్నారు. చిరు పొట్ట దశలో ఎలుక కన్నాలను గుర్తిస్తే, పొగ బెట్టడం ద్వారా వాటిని కంట్రోల్ చేయొచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.