News September 21, 2025

సిరిసిల్ల: మైనారిటీల కోసం మరో 2 పథకాలు..!

image

మైనారిటీ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం <<17777841>>మరో 2 పథకాలు<<>> ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ.50వేల ఆర్థిక సాయం అందించనుంది. రేవంతన్నా కా సహారా పథకం కింద దూదేకుల ముస్లింలకు మోపెడ్‌లు, బైక్‌లు పంపిణీ చేయనుంది. ఆసక్తిగలవారు OCT 6 వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి భారతి తెలిపారు. SHARE.

Similar News

News September 21, 2025

KNR: NHRC జిల్లా అధికార ప్రతినిధిగా స్వరూప

image

జాతీయ మానవ హక్కుల కమిటీ(NHRC) కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా జమ్మికుంటకు చెందిన ఇటిక్యాల స్వరూపను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు డా.మొగుళ్ల భద్రయ్య నియామక పత్రం అందించారని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి ప్రణయ్ తెలిపారు. పేదప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వరూప కృతజ్ఞతలు తెలిపారు.

News September 21, 2025

టంగుటూరు: 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకు సీజ్

image

విజిలెన్స్ అధికారి హేమంత్ కుమార్ శనివారం తెల్లవారుజామున 16 లక్షల విలువైన 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకును అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. పొదిలి నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా జాతీయ రహదారిపై లారీని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులు తీరు మార్చుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News September 21, 2025

HYD: క్యాప్స్‌ గోల్డ్‌లో 5వ రోజు ఐటీ సోదాలు

image

క్యాప్స్‌ గోల్డ్‌లో 5వ రోజూ ఐటీ సోదాలుజరుగుతున్నయి. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చెయ్యగా ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చందా శ్రీనివాస్, అభిషేక్‌ను ఐటీ అధికారులు విచారించారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను బినామీలుగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు.