News July 4, 2025
సిరిసిల్ల రచయితకు దక్కిన అరుదైన గౌరవం

సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత డా.పెద్దింటి అశోక్ కుమార్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన రచించిన ‘లాంగ్ మార్చ్’ నవలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలల్లో MA తెలుగు సెకండ్ ఇయర్ సిలబస్లోకి చేర్చారు. ఆయన రచించిన మరో ప్రఖ్యాత నవల ‘జిగిరి’ను నల్గొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ అకాడమిక్ సిలబస్గా బోధించనున్నారు. చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె పాఠశాలలో పనిచేస్తున్నారు
Similar News
News July 4, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,500 జాబ్స్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 2,500 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. బ్యాంకుల్లో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జులై 24. ప్రారంభ వేతనం నెలకు రూ.48,480. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News July 4, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణం

విశాఖలోని 3 ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్లను V.M.R.D.A. నిర్మించనుంది. మిథిలాపురి వుడా కాలనీ, మారికవలస, వేపగుంటల్లో మధ్యతరగతి కుటుంబాల కోసం 2BHK, 2.5 BHK, 3 BHK అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. PPP పద్ధతిలో నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణానికి గతంలో డిమాండ్ సర్వే నిర్వహించారు. ఆదరణ లభించడంతో వీటి నిర్మాణానికి నిర్ణయించారు.
News July 4, 2025
GNT: సీలింగ్ భూముల క్రమబద్ధీకరణపై జేసీ సమీక్ష

సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్లు, సర్వేయర్లతో గుంటూరు కలెక్టరేట్లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.