News November 6, 2025
సిరిసిల్ల: ‘రెండు రోజుల్లోగా సమర్పించాలి’

జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టుల నియామకానికి సంబంధించిన లిస్టును అధికారిక వెబ్సైట్ https://rajannasiricilla.telangana.gov.in ప్రచురించామని జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లోగా లిఖితపూర్వకంగా కలెక్టరేట్లో సమర్పించాలని స్పష్టం చేశారు.
Similar News
News November 6, 2025
మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

బోరాన్ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 6, 2025
వర్గల్: ‘మందుల కొరత లేకుండా చూడండి’

వర్గల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్, ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. పెద్ద ఆసుపత్రి కావున ఓపీ పెంచాలని, మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. పాత ఆసుపత్రి నుంచి పర్నిచర్ షిప్ట్ చేయించాలని, మెడిసిన్ కొరత లేకుండా సప్లై చేయాలని DMHOను ఫోన్లో ఆదేశించారు.
News November 6, 2025
SV యూనివర్సిటీ ప్రొఫెసర్పై సస్పెన్షన్ వేటు

సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎస్. విశ్వనాథ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థులను ర్యాగింగ్ చేయించినట్లు యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారణకు రావడంతో వేటుపడింది. ర్యాగింగ్పై విద్యార్థుల ఫిర్యాదు మేరకు యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎస్వీయూ ఏర్పాటు చేసింది. ఇంటరాక్షన్ సెషన్లో పేరుతో HOD ర్యాగింగ్ చేయించారని MSc సైకాలజీ విద్యార్థులు(ఫస్ట్ ఇయర్) SPకి PGRSలో ఫిర్యాదు చేశారు.


