News December 21, 2025

సిరిసిల్ల: ‘లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం’

image

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, DLSA చైర్మన్ పి నీరజ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన లోక్ అదాలత్ లో మాట్లాడుతూ.. కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోక్సో, ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రాధిక జైస్వాల్, DLSA సెక్రటరీ లక్ష్మణచారి, ASP చంద్రయ్య, జూపల్లి శ్రీనివాసరావు, చింతోజు భాస్కర్, పెంట శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News December 21, 2025

కామారెడ్డి జిల్లా తపస్ అధ్యక్షుడిగా బూనేకర్ సంతోష్

image

కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బూనేకేర్ సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు తపస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడు రవీంద్రనాథ్ ఆర్య ప్రకటించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై ఉపాధ్యాయులతో కలిసి ఉద్యమిస్తానన్నారు. మాజీ అధ్యక్షుడు రవీందర్ ఉన్నారు.

News December 21, 2025

జగిత్యాల బల్దియాలో నక్షా సర్వే ప్రారంభం

image

జగిత్యాల బల్దియా పరిధిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్షా కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సర్వే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా పట్టణ ప్రధాన విభాగాలను సర్వే నిర్వహించారు. 200 ఇళ్లకు ఒక బ్లాక్ చొప్పున పట్టణాన్ని విభజించి, 14 బృందాల ద్వారా GPSతో కచ్చితత్వంతో కూడిన సర్వేను 6 నెలల్లో ఈ సర్వే పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

News December 21, 2025

ఘన జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

☛ దేశీ ఆవుపేడ 100kgలు ☛ దేశీ ఆవు మూత్రం 5లీటర్లు ☛ బెల్లం 2kgలు ☛ పప్పు దినుసుల పిండి 2kgలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) ☛ గుప్పెడు పుట్టమట్టి
తయారీ: ఈ పదార్థాలను 100KGలు బాగా చివికిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి గోనెపట్టా కప్పాలి. 48 గంటల తర్వాత పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది.